• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోదీతో భేటీపై జగన్ సీక్రెసీ మతలబేంటో?

admin by admin
October 7, 2020
in Uncategorized
0
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు సుధీర్ఘ భేటీనే నిర్వహించారు. దాదాపుగా 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలొ ఏపీకి సంబంధించిన సమస్యలను జగన్ ఏ మేరకు ప్రస్తావించారన్నది అసలు అంతు చిక్కడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా ప్రధాని వద్దకు వెళ్లిన ఏ సీఎం అయినా తాను ఏమేం సమస్యలను లేవనెత్తాను? ప్రధాని ఏమేం హామీలిచ్చారు? అంతిమంగా రాష్ట్రానికి ఏమేం ప్రయోజనాలు చేకూరబోతున్నాయన్న విషయాలను మీడియా సమావేశం పెట్టి మరీ వివరిస్తారు. అయితే జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానితో భేటీలో అసలు ఏమేం చర్చకు వచ్చాయన్న విషయాన్ని జగన్ ఇప్పటిదాకా చెప్పిన పాపానే పోలేదు. దీంతో ఏదో సొంత ఎజెండాతోనే జగన్.. మోదీ వద్దకు వెళ్లారన్న విపక్షాల వాదనకు బలం చేకూరుతోందని కూడా చెప్పక తప్పదు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తీవ్ర ఆర్థిక లోటుతో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలో విభజన చట్టంలో ప్రస్తావించిన ప్రత్యేక హోదాను సాధించి తీరతామని జగన్ ఎన్నికలకు ముందు చెప్పారు. అయితే ఎన్నికలు ముగిసి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రత్యేక హోదాను పలికేందుకే జగన్ ఇష్ట పడటం లేదు. అయినా సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో కొలువుదీరిన మోదీ సర్కారు వద్ద ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాలేమని కూడా జగన్ ఇదివరకే చెప్పేశారు. ఈ క్రమంలో వారం పది రోజుల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వరుసగా రెండు రోజుల పాటు భేటీ వేసిన జగన్… ఆ వెంటనే మోదీ వద్దకు వెళ్లిపోయారు.

ఓ రాష్ట్రానికి సీఎం హోదాలో ప్రధాని వద్దకు జగన్ వెళ్లడంలో తప్పు లేదు గానీ… ప్రధాని వద్ద తాను ఏ చర్చించానన్న విషయాన్ని చెప్పకపోవడమే జగన్ చేస్తున్నన పొరపాటుగా చెప్పాలి. అయినా సొంత ఎజెండాతో ఢిల్లీ వెళ్లిన జగన్… మోదీతో తాను ఏం చర్చించానన్న విషయాన్ని ఎలా చెబుతారన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తించేవే. తనపై ఇప్పటికే అక్రమాస్తుల కేసులు వేలాడుతున్నాయి.

రాజకీయ నేతలపై నమోదయ్యే కేసులను ఏడాది వ్యవధిలోగా పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్న దరిమిలా… జగన్ వరుసపెట్టి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న వైనం చూస్తుంటే… ఎక్కడ తాను అరెస్ట్ అవుతానోనన్న భయం ఆయనను వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా బీజేపీకి దగ్గరై… రాష్ట్రంలో తనకు ప్రత్యర్థి వర్గమన్నదే లేకుండా చేసుకునే పనికి కూడా జగన్ సానబెడుతున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

మొత్తం మీద ఓ రాష్ట్రానికి సీఎం హోదాలో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న జగన్… రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి తన సొంత ఎజెండా మేరకే నడుచుకుంటున్నారన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తనపై నమోదైన కేసుల నుంచి తనను తాను రక్షించుకోవడంతో పాటుగా తన ప్రత్యర్థులను పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే జగన్ ముందుకు సాగుతున్నట్లుగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తనపై నమోదైన కేసులను కొట్టివేయించుకోవడంతో పాటుగా తన ప్రత్యర్థులైన చంద్రబాబు అండ్ కోను ఏదో రీతిన జైలులోకి నెట్టేసేలానే జగన్ మంత్రాంగం రచిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీతో భేటీకి సంబంధించిన వివరాలేమీ బయటపెట్టకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.

Tags: AndhraTopStories
Previous Post

వెంకయ్య లేక ఎన్నెన్ని కష్టాలో… దిద్దుబాటలో బీజేపీ !

Next Post

ఏపీ హైకోర్టులో సాక్షి ప్రస్తావన

Related Posts

జగన్ సర్కారు వీక్ సీక్రెట్
Andhra

ఏపీలో లాక్ డౌన్.. ఎక్కడ ? ఎపుడు?

April 9, 2021
సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ‘ఎన్.వి. రమణ’కు ‘నాట్స్’ అభినందనలు
NRI

సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ‘ఎన్.వి. రమణ’కు ‘నాట్స్’ అభినందనలు

April 7, 2021
‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?
TANA Elections

‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?

April 5, 2021
ఇక్కడ పుచ్చకాయ ప్లేట్ రూ.20…అక్కడ కేజీ పుచ్చకాయ రూపాయి
Uncategorized

ఇక్కడ పుచ్చకాయ ప్లేట్ రూ.20…అక్కడ కేజీ పుచ్చకాయ రూపాయి

March 31, 2021
Uncategorized

చంద్రబాబు గెడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు…లోకేష్ ఫైర్

March 16, 2021
Uncategorized

నిమ్మగడ్డకు షాక్…ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు కీలక తీర్పు

March 16, 2021
Load More
Next Post

ఏపీ హైకోర్టులో సాక్షి ప్రస్తావన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అమెరికా తెలుగు సంఘాలు- తెలుగు రాజకీయ పార్టీలు- అర్ధమౌతోందా?
  • టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
  • ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ‘వకీల్ సాబ్’ ఎపిసోడ్
  • ఏపీ సచివాలయంలో కరోనా విజృంభణ…నిర్లక్షమే కారణమా?
  • ఛత్తీస్ గఢ్ తో ఒడిశా కటీఫ్…కారణం తెలిస్తే షాకే
  • ఇదే జోరు సాగితే రోజుకు మిలియన్ కేసులు ఖాయం
  • బెంగాల్ లో తాజా పోలింగ్ వేళ జరిగిన కాల్పుల్లో 5 మృతి.. ఎందుకు?
  • ఐఎంఎస్ స్కామ్ లో నాయిని అల్లుడు…
  • వివేక హత్యపై జగన్ కు ఆర్కే సంధించిన సూటి ప్రశ్నలు
  • పూజారికి నత్తి.. వేశ్యకు భక్తి ఉండకూడదు.. ఇప్పుడెందుకీ సామెత?
  • వివేక హత్యపై జగన్ చెప్పాల్సిన మాటలు బాబు చెప్పటమా?
  • జగన్ మాట విని… ఏపీ డీజీపీ ఇరుక్కున్నట్టేనా
  • జడ్జిల దయతోనే జగన్ సీఎంగా ఉన్నారు … ఎపుడైనా సర్కారు కూలొచ్చు
  • Photos: ఈ పిల్లేంట్రా ఇంత కసిగా ఉంది !
  • లేఖతో అడ్డంగా ఇరుక్కున్న జగన్… ఈ షాక్ ఊహించి ఉండడు
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds