• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టార్గెట్ ఈట‌ల‌: నేటి నుంచి స‌ర్వే.. టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..

admin by admin
November 16, 2021
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
309
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హుజూరాబాద్ ఎమ్మెల్యే.. బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టార్గెట్‌గా .. సాగుతున్న కేసుల ప‌ర్వంలో కీల‌క ఘ‌ట్టానికి ఈ రోజు అధికారులు రంగంలోకి దిగారు. ఆయ‌న ఆక్ర‌మించార‌ని.. లేదా త‌క్కువ ధ‌ర‌ల‌కే కొనుగోలు చేశార‌ని అంటున్న‌ భూముల సర్వే ఈరోజు నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మెదక్ జిల్లాలోని భూముల సర్వే కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భూముల సర్వేకు రావాలంటూ ఈటల కుటుంబ సభ్యులతో పాటు మరో 154మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సర్వే నేటి నుంచి మూడు రోజుల పాటు సాగనుంది.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. తమ భూములను ఈటల ఆక్రమించాడని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలు రంగంలోకి దిగాయి. అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఈటల రాజేందర్ హేచరీల తో పాటు పక్క భూముల్లో సర్వే నిర్వహించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అధికారుల తీరుపై ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు హైకోర్టు ను ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సర్వే జరిగిందని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు ఈ అంశంతో సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు, తగు సమయం ఇచ్చి.. సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో జూన్ మూడో వారంలో పునఃసర్వేకు అధికారులు సిద్ధం కాగా.. కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు.

కరోనా తగ్గుముఖం పట్టడంతో అధికారులు భూముల సర్వేకు సన్నద్ధం అయ్యారు. సర్వేకు రావాలంటూ ఈటల రాజేందర్ సతీమణి జమున, కుమారుడు నితిన్ రెడ్డితో పాటు మరో 154మందికి ఈ నెల 8తేది నోటీసులు ఇచ్చారు. జమున హేచరీస్కు చెందిన గోడలకు నోటీసులు అతికించారు. 16, 17, 18 తేదీల్లో భూముల సర్వే చేయనునున్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా అధికారులు స‌ర్వే ప్రారంభించారు. దీంతో దీనిపై ఎలాంటి నివేదిక ఇస్తారో.. అని స‌ర్వ‌త్రా టెన్ష‌న్ నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.

Tags: allegations on eetelacm kcrhuzurabad mla eetela rajendarkcr targetting eetelasurvey on eetela's lands
Previous Post

రైతుల‌తో రాజ‌కీయం.. కాంగ్రెస్‌ రనవుట్ !

Next Post

మహా పాదయాత్రలో పాల్గొనరా? సోముకు అమిత్ షా క్లాస్

Related Posts

Movies

ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !

July 6, 2022
Movies

బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ

July 6, 2022
Andhra

మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు

July 6, 2022
Top Stories

నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !

July 6, 2022
Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Load More
Next Post

మహా పాదయాత్రలో పాల్గొనరా? సోముకు అమిత్ షా క్లాస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !
  • బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ
  • మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు
  • నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !
  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

యథా రాజా.. తథా పోలీసు!

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra