• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కోర్టు సెలవు రోజుల్లో రామోజీని టార్గెట్ చేసిన జగన్

NA bureau by NA bureau
March 12, 2023
in Andhra, Top Stories, Trending
0
ramoji and jagan

ramoji and jagan

0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మార్గదర్శిపై కేసు నమోదైంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈనాడు సంస్థల అధినేత.. రామోజీ గ్రూప్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న చెరుకూరి రామోజీరావును ఏ1గా పేర్కొంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన కోడలు శైలజను ఈ కేసులో ఏ2 గా పేర్కొంది. వారు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొంది.

విపక్ష నేతగా ఉన్న వేళలో.. వైఎస్ జగన్ స్వయంగా రామోజీ ఫిలింసిటీకి వెళ్లి రామోజీరావును కలవటం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్న వైనంపై జగన్ పలుమార్లు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే..మార్గదర్శిలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే పలుమార్లు సోదాలు నిర్వహించినా.. ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు.

అయితే.. తాజాగా కోర్టు సెలవులు చూసుకుని తెలివిగా శనివారం తెల్లవారుజాము నుంచి ఏపీ సీఐడీకి చెందిన అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న పలు మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన కార్యాలయాల మేనేజర్లు.. ఇతర సిబ్బంది నివాసాల్లో తనిఖీలు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.

శనివారం సాయంత్రానికి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ రామోజీరావుపైనా.. ఆయన కోడలు శైలజ పైనా.. సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా చెరుకూరి రామోజీ రావు, ఏ2గా చెరుకూరి శైలజ, ఏ3గా బి. శ్రీనివాసరావు ఇతరులను చేర్చారు. ఉదయమే మొదలైన సోదాలు రాత్రి వరకు సాగాయి. అనంతరం రామోజీతో పాటు ఆయన కోడలు ఇతరుల మీద సెక్షన్ 120బీ, 409, 420, 477(ఏ), రెడ్ విత్ 34 ఐపీసీ, 76 సీఎఫ్ఏల కింద మేనేజర్లను నిందితులుగా చేరుస్తూ కేసులు నమోదు చేశారు.

ఇదంతా కూడా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వీఎస్ఎస్ క్రిష్ణారావు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. మార్గదర్శి మేనేజర్ల ఇళ్లకు వెళ్లిన అధికారులు.. వారిని బలవంతంగా తమతో పాటు కార్యాలయాలకు తీసుకొచ్చి తలుపులు తెరిపించినట్లుగా తెలుస్తోంది.

విజయవాడ ఎంజీ రోడ్ లో ఉన్న మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయ మేనేజర్ శ్రీనివాస్ పడమట లంకలో ఉంటారు. సీఐడీ.. రిజిస్ట్రేషన్ శాఖల అధికారల టీంలు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి.. ఆయన్ను కారులో ఎక్కించుకొని మార్గదర్శి ఆఫీసుకు తీసుకొచ్చారు. మార్గదర్శి ఆఫీసు తలుపులు మూసి మరీ ఆయన్ను విచారించారు.

దీనిపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా ప్రశ్నిస్తారు? అంటూ వారు తప్పు పట్టారు. విశాఖలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. శనివారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తనిఖీలు సాగాయి. ఇదిలా ఉండగా.. సోదాలు శనివారమే కాదు ఆదివారం కూడా సాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఉదంతం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags: JaganmargadarsiRamoji raoజగన్మార్గదర్శిరామోజీరావు
Previous Post

NRI TDP-ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

Next Post

నాకు కాపులు ఓట్లేయలేదు – పవన్

Related Posts

tdp and ycp logos
Politics

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

March 23, 2023
sajjala ramakrishna reddy
Politics

స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

March 23, 2023
jagan lost people vote
Politics

వైసీపీలో వారిపై  అనుమానం చూపులు

March 23, 2023
manchu mohanbabu
Andhra

నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

March 23, 2023
panchumarthi anuradha
Politics

Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు

March 23, 2023
kcr, kavita
Telangana

కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

March 23, 2023
Load More
Next Post
janasena

నాకు కాపులు ఓట్లేయలేదు - పవన్

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra