వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు తీవ్ర అనారోగ్యం చేసినట్టు తెలిసింది. మొలలు, ఆస్తమా సహా గొంతు ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నట్టు వైసీపీకి చెందిన కీలక నాయకుడు ఒకరు తెలిపారు. తాడేపల్లిలో కీలక వ్యవహారాలు చక్కబెట్టే ముగ్గురు నుంచి నలుగురు నాయకుల్లో ఈయన ఒకరు.. దీంతో జగన్ అనారోగ్యంపై ఇటీవలకాలంలో వస్తున్న వార్తలు.. నిజమేనని తేలింది. జగన్ ప్రస్తుతం ఎక్కడా ఎక్కువ సేపు కూర్చోలేక పోతున్నారు.
అదేసమయంలో ఆయన ఎక్కువగా కూడా మాట్లాడలేక పోతున్నారు. ఇటీవల రెండు నియోజకవర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలు నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించినప్పుడు కూడా.. జగన్ ఎక్కువ సేపు మాట్లాడకుండా.. కేవలం 20 నిమిషాల్లోనే వెళ్లిపోయారు. మిగిలిన సమావేశాన్ని సజ్జల రామకృష్నా రెడ్డి, తాడేపల్లివ్యవహారాలు చూసే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు నిర్వహించారు. అయితే.. అప్పటికే.. జగన్కు మొలల వ్యాధి ఉందన్న విషయం ఎవరికీ తెలియదు.
ఇటీవల ఆయన బెంగళూరుకు వెళ్లింది కూడా.. మొలల వైద్యానికేనని తెలిసింది. ఇక, వాతవారణ మా ర్పు కారణంగా ఆయన గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు సమాచారం. ఎక్కువగా వేడి నీళ్లు తీసు కుంటున్నారని.. ద్రవపదార్థాలనే ఆహారంగా తీసుకుంటున్నారని.. కీలక నాయకుడు వెల్లడించారు. అదేవిధంగా ఆస్తమా కూడా ఆయనను ఇబ్బంది పెడుతోందని తెలిసింది.
ఈ నేపథ్యంలో బెంగళూరుకు పయనమయ్యారు. వచ్చే నెల రోజుల వరకు కూడా.. బెంగళూరులోనే ఉంటారని సమాచారం. ఏదైనా అత్యవసరమైతే.. తప్ప.. జగన్ మరోనెల రొజుల వరకు ఏపీకి వచ్చే అవకాశం లేదని కీలక నాయకుడు వెల్లడించారు. కాగా.. గత ఏడాది కూడా.. ఎన్నికలు పూర్తి కాగానే.. ఆయన విదేశలకు వెళ్లారు. అటు నుంచి అటే.. మళ్లీ బెంగళూరుకు వెళ్లారు. కాగా.. ఈ పదిమాసాల్లో రమారమి.. ఏడున్నర మాసాల వరకు బెంగళూరులోనే జగన్ ఉన్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.