ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి తల్లి, వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పుట్టినరోజు ఈ రోజు. ఇక ఇప్పటి వరకు జగన్ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి యేటా జగన్ తన తల్లికి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేవారు. అయితే ఈ యేడాది శనివారం మధ్యాహ్నం అయినా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. వైసీపీ అంతర్గత ప్రచారం ప్రకారం జగన్కు, తల్లితో పూడ్చలేనంత అగాధం పెరిగిపోయిందంటున్నారు.
ఇక షర్మిల రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా విజయమ్మ కుమార్తెకు అండగా ఉంటూ వచ్చారు. అసలు ముందు జగన్ జైలులో ఉన్నప్పటి నుంచే విజయమ్మ, షర్మిల ఇద్దరూ కూడా జగన్ కోసం రాష్ట్రం అంతటా ప్రచారం చేశారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ముందు చెల్లి షర్మిలతో ఆ తర్వాత తల్లి విజయమ్మతోనూ జగన్కు సఖ్యత లేదు. తల్లి .. చెల్లికి సపోర్ట్ చేయడాన్ని తట్టుకోలేకపోయారు. రాజకీయంగా విబేధించారు అన్న కారణంతోనే జగన్ తల్లి, చెల్లిపై కోర్టుకు కూడా ఎక్కారు.
తన చెల్లి షర్మిలకు తనపై ఏ మాత్రం ప్రేమలేదన్న కారణంతో చెల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా రద్దు చేసుకుంటున్నానని పిటిషన్ వేశారు. తన కొడుకు, కుమార్తె మధ్య ఆస్తుల విషయంలో తలెత్తిన వివాదంతో విజయమ్మ కూడా తీవ్రంగా నలిగిపోయారు. అసలు గత ఎన్నికలకు ముందు ఎటు వైపు వెళ్లాలో కూడా తెలియని డైలమాలో పడిపోయారు. చివరకు 2019 ఎన్నికల్లో తనతో పాటు పాటు కుమార్తె జగన్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని.. పార్టీ అధికారంలోకి వచ్చాక తన కుమార్తెను.. కొడుకు ఏ మాత్రం పట్టించుకోలేదన్న నిర్ణయానికి వచ్చిన విజయమ్మ కొడుకు విషయంలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.
చివరకు ఆమె జగన్కు దూరంగా షర్మిలతోనే ఉంటున్నారు. ఇక తాజాగా విజయమ్మ బర్త్ డే రోజు కనీసం జగన్ సోషల్ మీడియా వేదికగా కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంతో వీరి మధ్య ఉన్న విబేధాలు ముదిరి పాకాన పడిన వార్తలకు మరింత బలం చేకూర్చాయి. సోషల్ మీడియాలో జగన్ ఎలాగూ తల్లికి విష్ చేయలేదు.. కనీసం ఫోన్ చేసి అయినా విష్ చేశారా ? అన్నది తెలియలేదు.