ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాజధాని అమరావతికి వస్తున్నారు. ఆయన రాకకు సంబంధించిన షె డ్యూల్ కూడా ఖరారైంది. మే 2న రాజధానికి వచ్చి.. ఇక్కడ పునః ప్రారంభించే పనులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు. దీంతో గతానికి భిన్నంగా ఈ దఫా మోడీ మార్పు చూపిస్తారని అంటున్నారు మేధా వులు. 2015లోనూ రాజధాని అమరావతికి వచ్చిన ప్రధాని.. అప్పట్లో పవిత్రనదుల నుంచి నీటిని తీసుకు వచ్చారు. అదేవిధంగా పవిత్ర ప్రాంతాల నుంచికూడా మట్టిని తీసుకువచ్చారు.
అయితే.. ఆనాడు మోడీకి-చంద్రబాబుకు మధ్య బాగున్నంత వరకు ఈ విషయం వివాదం కాలేదు. కానీ, విడిపోయిన తర్వాత.. మాత్రం మోడీ తీసుకువచ్చి మట్టి-నీళ్లు ఇచ్చారంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అయితే.. అప్పటికి ఇప్పటికి తేడా ఉన్న నేపథ్యంలో ఈ సారి మోడీ మంచి కానుకలే తెచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో మోడీ సర్కారు బలంగా ఉండడానికి చంద్రబాబు కీలకంగా మారారు.
అప్పట్లో మాత్రం బీజేపీనే సంఖ్యాపరంగా బలమైన మెజారిటీతో ఉంది. దీంతో మోడీ మట్టి నీళ్లు మాత్రమే ఇచ్చారు.కానీ, ఇప్పుడు బాబుపై ఆధారపడిన నేపథ్యంలో అమరావతికి మరిన్ని వరాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే.. అవి ఎలా ఉంటాయి? అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. వాస్తవానికి అమరావతికి రుణాలు ఇప్పించారు. ఇవి కాకుండా.. రూ.1500 కోట్ల మేరకు సాయం ప్రకటించి.. దీనిలో 385 కోట్ల రూపాయలను ఇటీవలే విడుదల చేశారు.
అదేసమయంలో విశాఖ ఉక్కుకు కూడా సాయం చేశారు. పోలవరం ప్రాజెక్టు సరేసరి. కేవలం రాజధాని విషయానికి వస్తే.. అమరావతి-హైదరాబాద్ రహదారి నిర్మాణానికి కూడా కేంద్రం సిగ్నల్ ఇచ్చింది. మెట్రోకుకూడా.. లైన్ క్లియర్ చేసింది. అలాగే అనంతపురం-అమరావతి రోడ్ కారిడార్కూడా.. కేంద్రమే నిర్మించనుంది. దీనికి భూసేకరణ మాత్రం రాష్ట్రం చేయాల్సి ఉంటుంది. సో.. ఇప్పటికే అన్నీ ప్రకటించినా.. ఇంకా ఏదో చేస్తారన్న వాదన అయితే.. కూటమి పార్టీల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తుండడం గమనార్హం.