జమ్ము కశ్మీర్ లోని పహెల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన నేపథ్యంలో పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడైనా ఎలాంటి ఘటనలైనా జరిగే అవకాశం ఉందని కేంద్రం తాజాగా హెచ్చరించింది. ముఖ్యంగా తీర ప్రాంతమైన ఏపీ, వాణిజ్య ప్రాంతమైన తెలంగాణలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. శనివారం సాయంత్రం ఆయా వివరాలతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఎంతో అవసరం ఉంటే తప్ప.. ఆయా ప్రాంతాలకు వెళ్లరాదని కేంద్రం సూచించింది. రెండు రోజుల పాటు సంయమనం పాటించాలని.. ఎవరూ బయటకు రావొద్దని పేర్కొంది.
ఇక, రెండు తెలుగు రాష్ట్రా లప్రభుత్వాలు కూడా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ దళాలను తక్షణమే ఆయా ప్రాంతాల్లో మోహరించాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో జన సమ్మర్థాన్ని తగ్గించడంతోపాటు.. ఇళ్లలో జాగ్రత్తలు పాటించేలా కుటుంబా లకు సూచనలు చేయాలని ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. ప్రజల సహకారం.. ఈ కీలక సమయంలో అత్యంత ముఖ్యమని.. ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడమే మేలని సూచించింది. అత్యంత అవసరమని భావిస్తేనే బయటకు రావాలని సూచించింది.
ప్రార్థనా స్థలాలు, దేవాలయాలకు కూడా.. ప్రజలు రాకను తగ్గించుకోవాలని కేంద్రం పేర్కొంది. ప్రార్థనా స్థలాలు, పర్యాటక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు.. ఇలా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు.. ఉగ్ర వాద దాడులకు గురయ్యే అవకాశం ఉందని చాలా సీరియస్గా హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు.. ప్రజలు సహకరించాలని కోరింది. ప్రభుత్వాలు కూడా.. తక్షణమే ప్రజలకు అవగాహన కల్పించాలనిసూచించింది. ఈ విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా.. కేంద్రం తక్షణమే స్పందిస్తుందని.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవీ.. తెలంగాణలోని హై అలర్ట్ ప్రాంతాలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమాన్రయం
కూకట్పల్లి
నాంపల్లి
ఎంజీబీఎస్-హైదరాబాద్
ట్యాంక్బండ్-హైదరాబాద్
ఇవీ.. ఏపీలోని హై అలర్ట్ ప్రాంతాలు
తిరుమల, అలిపిరి
విశాఖ రైల్వే స్టేషన్
రామకృష్ణబీచ్-విశాఖ పట్నం
రైల్వే స్టేషన్-విజయవాడ
జగదాంబ సెంటర్- విశాఖపట్నం
విజయవాడ బస్టాండ్
బందరు రోడ్డు ప్రాంతం పూర్తిగా