జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీలో కక్షా రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. టిడిపి నేతలు మొదలు సామాన్యుల వరకు అందరినీ వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని, తాము చెప్పింది వినకపోతే అక్రమ కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో ఇప్పటంలో స్థానికులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా సింగమనల ఎమ్మెల్యే, వైసీపీ మహిళా నేత జొన్నలగడ్డ పద్మావతిపై గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన ఓ రైతు సంచలన ఆరోపణలు చేశారు. జొన్నలగడ్డ పద్మావతికి ఇసుక తోలుకోనివ్వలేదని తన పొలంలోని మామిడి, జామ చెట్లను పీకించేశారని ఆ రైతు సంచలన ఆరోపణలు చేశారు. తన పొలంలో నుంచి ఇసుక తోలుకునేందుకు ఒప్పుకోలేదన్న కారణంతో చేతికి అందిన చెట్లను పెకలించి వేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఏడేళ్ల నుంచి తాను ఆ చెట్లను పెంచుతున్నానని, కాయలు చేతికి వచ్చిన సమయానికి ఇలా కక్షగట్టి వాటిని తొలగించారని ఆరోపించారు. ఈ పొలాన్ని నమ్ముకునే తన కుటుంబం ఉందని, ఈ పంట నాశనం కావడంతో తమకు మందు తాగి చావడం తప్ప వేరే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి మంచి పేరు ఉందని కానీ, ఆ పేరును జగన్ చెడగొడుతున్నారని ఆరోపించారు. జగనన్నకు ఓటేసినందుకు తమ చెప్పుతో తాము కొట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా… వైఎస్ పేరు జగన్ చెడగొడుతున్నాడంటోన్న రైతు చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
*ఏమిటీ దుర్మార్గం ఇసుక తోలుకోనివ్వలేదని చేతికొచ్చిన మామిడి* *జామ చెట్లు పీకించేస్తారా? తండ్రి పేరు చెడగొట్టేకే వచ్చినట్టున్నాడు*. *మందుతాగి చావడం తప్ప మాకు వేరే దిక్కు లేదు* *గార్లదిన్నె మండలం కొప్పలకొండ రైతు ఆవేదన* 😢😡😔 pic.twitter.com/W5jJqOOoA9
— Target 175 (@Naathonikenduku) November 7, 2022