వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నృత్యకారిణి దివ్వెల మాధురి జంట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దువ్వాడ ఫ్యామిలీ వివాదంతో మాధురి తెరపైకి వచ్చింది. భార్య వాణి, కూతుళ్లకు దూరమైన దువ్వాడ.. కొంత కాలంగా మాధురితోనే ఉంటున్నారు. జంటగా ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ హంగామా చేస్తున్నారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోవడంతో పాటు తాము పెళ్లికి సిద్ధమని కూడా చెబుతున్నారు.
అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతుళ్ల వెర్షన్ మరో విధంగా ఉంది. డబ్బు కోసమే శ్రీనివాస్ ను మాధురి ట్రాప్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను గతంలోనే ఖండించిన మాధురి.. తాజాగా మరోసారి రియాక్ట్ అయింది. దువ్వాడ శ్రీనివాస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో.. అతనికి ఆస్తులంటూ ఏమీ లేవు.. ఉన్నవన్నీ భార్య వాణికే ధారాదత్తం చేశారని మాధురి స్పష్టం చేశారు. ఏమీ లేక ఉన్నప్పుడు అప్పు ఇచ్చి ఆయన్ను నిలబెట్టానన్నారు. డబ్బు కోసం శ్రీనివాస్ను ట్రాప్ చేయాల్సిన అవసరం తనకు లేదని.. తాను గోల్డెన్ స్పూన్ తో పుట్టానని మాధరి తెలిపారు. ఈ క్రమంలోనే తన ఆస్తుల చిట్టాలను కూడా ఆమె బయటపెట్టారు.
శ్రీకాకుళం, టెక్కలి, వైజాగ్ లో మాకు ఆస్తులు ఉన్నాయి. టెక్కలిలో నా పేరు మీద ఓ పెట్రోల్ బంక్ ఉంది. వైజాగ్ స్కై పార్క్ గేటెడ్ కమ్యూనిటీలో రూ. 2 కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది. శ్రీకాకుళంలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. నాకు డబ్బుకు కొదవ లేదు. నా తండ్రి రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించారు. మా తాతగారు భూస్వామి. పుట్టుకతోనే నేను కోటీశ్వరరాలిని. సో.. ఎవరి ఆస్తులనో లాక్కోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ మధురి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాంతో ఆస్తుల్లో దువ్వాడ జీరో.. మాధురి హీరో అన్న విషయం స్పష్టమైంది.