• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జాబ్ క్యాలెండ‌ర్ ఏమైంది జ‌గ‌న్‌?.. చంద్ర‌బాబు లేఖ‌

admin by admin
June 13, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
చంద్రబాబు
0
SHARES
13
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యం విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు.

ఏపీపీఎస్సీ నిర్వీర్యమైనట్లుందని.., గ్రూప్‌-1 ఎంపిక తీరుపట్ల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.

ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్ధుల ఎంపికలో అవకతవక లపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ  జగన్కు లేఖ రాశారు.

నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఏపీపీఎస్సీ నిర్వీర్యమైందని విమర్శించారు.

ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలవుతుందని యువత మూడేళ్లగా ఎదురు చూస్తున్నా.. ఫలితం శూన్యమని మండిపడ్డారు.

గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయటంలో ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనను కలుగజేస్తోందని ధ్వజమెత్తారు.

2018లో ప్రకటించిన 165 గ్రూప్‌-1 ఉద్యోగాలకు డిసెంబర్‌ 2019లో వ్రాత పరీక్షలు జరిపి మే 2021లో ఫలితాలు ప్రకటించారని గుర్తుచేశారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారని.., పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకగా జరిగిందని చంద్రబాబు విమర్శించారు.

తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కార్యదర్శి, కమిషన్‌ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్థులు భావిస్తున్నారన్నారు.

ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనానికి, రెండవ మూల్యాంకనానికి ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.

తమ అస్మదీయులను అందలం ఎక్కించటం కోసం గ్రూప్‌-1 మెయిన్స్‌లో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు.

మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు రెండవసారి విడుదల చేసిన ఫలితాలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో అభ్యర్దులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీఎం జగన్కు రాసిన లేఖలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Previous Post

రోజా.. చిత్తూరులో ఫ‌ట్ ?  నెల్లూరులో హిట్ !

Next Post

తెలంగాణ ద్రోహితో మీటింగా కేసీఆర్?

Related Posts

Trending

ఎగ్జిట్ పోల్…కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

November 30, 2023
Telangana

కేసీఆర్ సారూ..అలానే చేశారు!

November 30, 2023
Top Stories

కవితపై ఎఫ్ఐఆర్..రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

November 30, 2023
Trending

ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!

November 30, 2023
jagan kcr
Trending

సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?

November 30, 2023
KCR
Telangana

కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?

November 30, 2023
Load More
Next Post

తెలంగాణ ద్రోహితో మీటింగా కేసీఆర్?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఎగ్జిట్ పోల్…కేటీఆర్ కు రేవంత్ కౌంటర్
  • కేసీఆర్ సారూ..అలానే చేశారు!
  • కవితపై ఎఫ్ఐఆర్..రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు
  • భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!
  • గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు
  • ‘వై ఏపీ నీడ్స్ జగన్’..సజ్జలకు హైకోర్టు సూటి ప్రశ్న!
  • క‌ళ్ల‌జోళ్లు-బ్యాట్లు-గ్లౌజులు… దేన్నీ వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌
  • వైఎస్ భారతికి షాకిచ్చిన లోకేష్
  • ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో
  • అగ్రరాజ్యానికి సైబర్ షాక్..నిలిచిన వైద్య సేవలు
  • మీ నత్తి పకోడీని అడుగు విజయసాయి: అయ్యన్న

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra