• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గేట్లకు గ్రీజు పూయలేకపోయావ్… నువ్వు మూడు రాజ‌ధానులు కడతావా?

ఇసుక కోసం అంతమందిని చంపుతావా- జగన్ వైఫల్యంపై చంద్రబాబు పంచ్ లు

admin by admin
December 4, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
427
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాష్ట్ర ప్రజలు వరదల్లో ఇబ్బంది పడుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం ప్రశాంతంగా ఉంటున్నారని.. ఆయ‌న‌ను చూస్తే.. త‌న‌కు నీరో చ‌క్ర‌వ‌ర్తి గుర్తుకు వ‌స్తున్నాడ‌ని.. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ పరామర్శలో.. జనాలు ఎవరినీ బయటకు రానీయకుండా అడ్డుకుంటున్న‌ర‌ని తెలిపారు.

బాధితులకంటే ఎక్కువ పోలీసులనే పెట్టి ఓదార్పు చేస్తున్నారని మండిపడ్డారు. పెన్నా నదిలో కరకట్టలకు ప్రమాదం జరిగేలా ఇసుక తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయి వరదలు ఉంటే.. సీఎం సిగ్గులేకుండా నాడు పెళ్లికి పోయారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరైతే ఇలాంటి ఘటనకు సిగ్గుతో తల వంచుకుంటా రన్నారు.

వరదలకు ప్రాణాలు, ఆస్తులు పోయి ఉంటే.. జనం జగన్ను చూసి మురిసిపోతారా..? స్వాగతం పలుకుతారా? అని నిలదీశారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హులని అన్నారు. తుమ్మల కుంట చెరువు ను క్రికెట్ స్టేడియంలా మార్చారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఒక్క నెల్లూరులోనే 2 వేల కోట్ల నష్టం జరిగిందని.. ప్రాణాలకు రక్షణ కాదు.. డెడ్ బాడీ కూడా ఇవ్వలేని ప్రభుత్వమ‌ని దుయ్యబట్టారు.

ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల వల్లనే వరదల్లో 62 మంది చనిపోయారని బాబు ఆరోపించారు. రూ. 6 వేల కోట్ల విలువైన పంట, ఆస్తి నష్టం జరిగిందని అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి వళ్లంతా ఇగో అన్న ఆయన… అందుకే జ‌గ‌న్  ప్రభుత్వ చర్యలను తుగ్లక్ చర్యలు అన్నామని తెలిపారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాణ నష్టం అని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనకు ఏమి సమాధానం చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలిసో…తెలియకో ఓట్లు వేసిన పాపానికి ప్రజల ప్రాణాలు బలిగొంటారా అంటూ మండిపడ్డారు. జ్యుడీషియల్ ఎంక్వయిరీ అడిగితే ఎందుకు అంగీకరించలేదని చంద్రబాబు నిలదీశారు.

గతేడాది వరదలు వచ్చినప్పుడు కూడా అన్నమయ్య ప్రాజెక్టు ఐదో గేటు పని చేయలేదని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పుడు మూడు గేట్లు పని చేయకుంటే రెండు గేట్లని రిపేర్ చేయించి, ఓ గేట్ వదిలేశారని.. దాని కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. వర్షాల సమయంలో తమను ఎవ్వరూ హెచ్చరించలేదని నా పర్యటన సందర్భంగా బాధితులు చెప్పారని బాబు గుర్తుచేశారు.

ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. 330 మీటర్ల కరకట్ట కొట్టుకెళ్లిందన్నారు. గత నెల 19న వరద వచ్చి ప్రాజెక్టు కొట్టుకుపోతే.. కుప్పంలో ఓడిపోయారు కాబట్టి తన మొహం చూడాలంటారా? అంటూ విమర్శించారు. సీఎం పైశాచికానందం పొందారని చంద్రబాబు మండిపడ్డారు.

గేటుకు గ్రీజు పూయ‌డం రాని సీఎం మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏడాది కాలంగా గేట్ రిపేర్ చేయించలేకపోయారని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యంలో ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్లను నిధులను కూడా మళ్లించారని దుయ్యబట్టారు.

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ తప్పిదం వల్ల చనిపోతే.. కోటి రూపాయలు నష్ట పరిహరం ఇచ్చారన్నారు. వరద మృతుల కుటుంబాలకు కూడా కోటి రూపాయలు నష్టపరిహరం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags: andhrapradeshannamaiah projectannamayyaapChandrababuJagankadapaRayalaseemaRayalaseema floodsYSRCP
Previous Post

Payal Rajput : పొరపాటును షర్టు పక్కకు చెదిరింది .. హాట్ సీన్ రివీల్

Next Post

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో వైసీపీ డీలా… ప్లాన్ చేంజ్

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో వైసీపీ డీలా... ప్లాన్ చేంజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra