బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో మల్టీస్టారర్ చేయబోతున్నారా? వీరి కాంబో మూవీకి డైరెక్టర్ కూడా ఖరారు అయ్యారా? అంటే అవునన్న సమాధానమే వినిస్తోంది. వాస్తవానికి ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సి ఉంది. మోక్షజ్ఞ డెబ్యూను గ్రాండ్ గా ప్రారంభించాలని బాలయ్య భావించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. కానీ షూటింగ్ మొదలు కావడానికి ఒక్క రోజు ముందు ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం తనయుడి లాంచింగ్ కు బాలయ్య మరో బిగ్ స్కెచ్ వేశారట. ప్రస్తుతం `అఖండ 2 తాండవ ` తో బిజీగా బాలయ్య.. తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేస్తున్నారట. గతంలో వీరిద్దరి కాంబోలో గౌతమి పుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య మరో సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాతోనే మోక్షజ్ఞను కూడా తెరంగేట్రం చేయించబోతున్నారట.
ఇదొక మల్టీస్టారర్ మూవీ అని.. ఈ చిత్రాన్ని బాహుబలి సినిమాను ప్రొడ్యూస్ చేసిన అర్కా మీడియా నిర్మించబోతుందని వార్తలు వస్తున్నాయి. కాగా, `హరిహర వీరమల్లు` ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్.. ప్రస్తుతం `ఘాతీ` అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఘాతీ త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ఘాతీ అనంతరం క్రిష్, బాలయ్య మూవీ పట్టాలెక్కొచ్చని అంటున్నారు.