వైసీపీ నేతలకు పాలనలో ఏది ప్రయారిటీయో తెలియదు.
ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలు పాలకుల మొదటి లక్షణం.
దానిని నెరవేర్చడంలో ప్రభుత్వాలు అన్నిరకాల ప్రయత్నాలు చేయాలి.
సీజనల్ వ్యాధులు కంట్రోల్ చేయడం ప్రభుత్వం బాధ్యత.
ఆ బాధ్యతను నిర్వర్తించిన చంద్రబాబును అసెంబ్లీలో కామెంట్ చేసి నవ్వు కున్నారు వైసీపీ వాళ్లు
దోమలపై దండయాత్ర అని చంద్రబాబు ప్రభుత్వం దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తే నవ్విన వైసీపీ వాళ్లు… ఇపుడు ఆ దోమల వల్ల జనం రోగల బారిన పడి ఆస్పత్రులు నిండిపోతుంటే అక్కడ సదుపాయాలు కల్పించలేక చేతులు ఎత్తేస్తున్నారు.
నాడు చంద్రబాబు గారు దోమలపై దండయాత్ర అంటే గాలి బుడగల బుగ్గన అసెంబ్లీలో పళ్ళన్నీ బయట పెట్టి నవ్వాడు ఈ రోజు అదే దోమల వల్ల గిరిజన ప్రాంతాలు వణికి పోతున్నాయి కానీ పళ్ళు బయట పెట్టి నవ్విన బుగ్గన మాత్రం ఢిల్లీలో అప్పుల కోసం తిరుగుతున్నాడు pic.twitter.com/I1qtJ4Rhdk
— Lokesh Yuvasena (@YuvasenaLokesh) July 21, 2021
ఇదిగో ఇది చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యంలో భాగంగా చేపట్టిన కార్యక్రమం.
దానిని కింద వీడియోలో చూడొచ్చు.
ఆ కార్యక్రమాన్ని ఎగతాలి చేస్తూ అసెంబ్లీలో బుగ్గన మాట్లాడిన మాటలు కింద వీడియోలో చూడొచ్చు.
అసలు ఆ ప్రోగ్రాం అంతరార్థాన్ని అర్థం చేసకోలేని తమ అజ్జానంతో జోకులు వేసుకున్న వైసీపీ నేతలు, మంత్రులు నేడు ప్రజలను రోగాల పాలు చేశారు. ఆ మంత్రి గారు బుగ్గన ప్రవచనాలు అసెంబ్లీలో కింద వీడియోలో వినండి.