బహుశా ఇలాంటి విచిత్రం చరిత్రలో మీరు ఎపుడూ విని ఉండరు.
జగన్ రెడ్డి పాలనతో ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ఏ మూలకు వెళ్లినా స్పష్టంగా తెలిసిపోతుంది.
ప్రజలతో పొగిడించుకోవడానికి జగన్ రూటే వేరు.
ముందు నోటి ముందున్న కూడును లాగేయడం. కాసేపు ఆకలికి మాడ్చడం, తర్వాత పెద్ద ప్లేటు పెట్టి అందులో నాలుగు ముద్దలు పెట్టి చూశావా మీ ఆకలి తీర్చాను అనడం ఇదే ఏపీలో రివాజుగా మారింది.
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు అన్నీ కూల్చేసి పేదోడి నోటి కాడి కూడును లాగేశాడు. 5 రూపాయలకు దొరికే భోజనాన్ని పేదోడికి దక్కకుండా చేశాడు. దీంతో అన్న క్యాంటీన్లు తెరవాలని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది.
ఎంతకీ జగన్ రెడ్డి పట్టించుకోకపోవడంతో టీడీపీ సొంత డబ్బులతో అన్న క్యాంటీన్లు ప్రారంభించడం మొదలుపెట్టింది.
అంతే… జగన్ రెడ్డి సర్కారుకు కోపం వచ్చింది. అన్నం పెట్టడానికి అనుమతి లేదంట అందుకే అన్న క్యాంటీన్లను కూల్చేశాడట. ఇదెక్కడి విచిత్రమో మరి… చరిత్రలో ఎన్నడూ కాననది.
పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడానికి సిగ్గులేదా జగన్ రెడ్డి? అన్న క్యాంటీన్లు మూసేశారు. మేం పేదలకు భోజనం పెడతామంటే ఒప్పుకోరు. మంగళగిరిలో పేదలకు రూ.2 కే భోజనం అందించడానికి ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్ కి అనుమతి లేదంటూ జగన్ రెడ్డి సర్కార్ కూల్చేయడం అత్యంత హేయమైన చర్య.(1/2) pic.twitter.com/AzqFVgmcnS
— Lokesh Nara (@naralokesh) June 9, 2022