ప్రముఖ నటి అభినయ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేమికుడు వేగేశ్న కార్తీక్ అలియాస్ సన్నీ వర్మతో అభినయ బుధవారం ఏడడుగులు వేసింది. జూబ్లీహిల్స్లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. చిన్నతనం నుంచి కార్తీక్, అభినయ స్నేహితులు. ఆ స్నేహమే తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. సుమారు 15 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న అభినయ, కార్తీక్.. ఈ ఏడాది మార్చి 9న నిశ్చితార్థం చేసుకున్నారు.
ఏప్రిల్ 16న కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ నెల 20వ తేదీన గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇకపోతే వినికిడి మరియు మాటల లోపం ఉన్నప్పటికీ.. అభినయ సినిమా రంగంలో తన ప్రతిభను చాటుకుంది. 2008లో `నేనింతే` సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన అభినయ.. 2009లో విడుదలైన తమిళ బ్లాక్ బస్టర్ `నాడోడిగల్`తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో `శంబో శివ శంబో`తో రీమేక్ చేశారు. తెలుగు రీమేక్లోనూ అభినయ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అద్భుతమైన నయనతో తన లోపాలను కూడా జయించిన అభినయ.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం `ముక్తి అమ్మన్` అనే తమిళ చిత్రంలో అభినయ యాక్ట్ చేస్తోంది. అభినయ భర్త బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే.. వేగేశ్న కార్తీక్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. కార్తీక్ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. అతను పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో అభినయ, హీరో విశాల్ ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. `మార్క్ ఆంటోనీ` మూవీలో విశాల్, అభినయ జంటగా నటించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ రిలేషన్లో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను విశాల్ తో పాటు అభినయ కూడా ఖండించింది. ఆ సమయంలోనే తన లాంగ్ టర్మ్ రిలేషన్, ప్రియుడి గురించి మీడియాకు తెలియజేసింది.