పిల్లి పిల్లలను మార్చినంత తేలికగా జీవిత, రాజశేఖర్ లు పార్టీలు మార్చారు. అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీలో సెటిలయ్యారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలోను ఉండనంటున్నారట. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీలను చూశారు వాళ్లు. చివరకు సెన్సార్ బోర్డు సభ్యురాలిగా జీవితను నియమించడంతో భాజపాలో ఉండిపోయారు. ఇప్పుడు అక్కడ నుంచి బయటపడతారట. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆ పార్టీలో ఉంటే తనకు ఇబ్బంది అని భావిస్తున్నారని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో జీవిత మంతనాలు జరిపారు. తాను టీడీపీలోకి వస్తానని చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్ పరిసరాల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వాలని కండీషన్ పెడుతున్నారు.
తెలంగాణలో టీడీపీకి కార్యకర్తలు ఉన్నా.. నేతలు లేరు. కాబట్టి జీవితరాజశేఖర్ లను ఆహ్వానించే అవకాశం ఉంటోంది. మల్కాజ్ గిరి టిక్కెట్ తనకు ఇవ్వాలని కోరుతున్నారట జీవిత. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఏమంటారో.. అసలు ఒప్పుకుంటారో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టీడీపీని తిట్టిపోయిన జీవిత రాజశేఖర్ లు తిరిగి వస్తారా అనేది ఆసక్తికరమే. చిరంజీవిని దారుణంగా తిట్టిన జీవిత రాజశేఖర్ లు ఆ తర్వాత ఆ కుటుబంతో సంబంధాలను పునరుద్దరించుకుంది. ఇప్పుడు అంతే. టీడీపీ కాకపోతే ఇంకో పార్టీ అన్న చందాన వ్యవహరిస్తున్నారు వాళ్లు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు నెలలు పూర్తయి మూడవ నెలలోకి ఈ యాత్ర అడుగుపెట్టింది. తన సొంత ఇలాఖా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు సొంత జిల్లా కడపతో పాటు కర్నూలు, […]
బీజేపీ – వైసీపీ మధ్య రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే వాదన సాగుతోంది. ప్రధాని మోడీ, వైకాపా అధినేత జగన్ మధ్య విజయసాయిరెడ్డి వారధిగా పని చేస్తున్నారని టీడీపీ అంటోంది. పైకి అవిశ్వాస తీర్మానం పెడుతూనే లోపల బీజేపీకి అనుకూలంగా చర్చలు జరుపుతుందంటున్నారు. మరోవైపు కేంద్రం చర్యలు అలానే ఉన్నాయి. […]
ప్రభుత్వాలు మారతాయి. పాలకులు మారతారు. కానీ అధికారిక రహస్యాలు అంతే ఉండాలి. లేకపోతే ప్రజలకు ఇబ్బంది వస్తోంది. ఆమాత్రం ఇంకితజ్ఞానం పని చేసే వారికి ఉంటోంది. దేశరక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక రహస్యాలు అన్నీ అలానే ఉంటాయి. అంతే కాదు..పాలన వ్యవహారాలు రహస్యంగానే ఉంచాలి. కానీ అలా చేయడం […]
Be the first to comment